Sunday, July 3, 2022

ఆచార్య సద్బోధన

ఆచార్య సద్బోధన:
➖➖➖✍️

"పరోపకారానికి మించిన పుణ్యంలేదు. పరనిందను మించిన పాపం లేదు.

ఒకరు మీకు కష్టం కలిగించినంత మాత్రాన వారిపై మీరు నిందలు మోపాల్సిన పనిలేదు.

అలాంటి వారు మీకు సుఖదుఃఖాలు కలిగించటం ద్వారా మీ కర్మ పరిపక్వమయ్యేందుకు తోడ్పడుతుంటారు అనే భావనతో మెలగటమే ఉత్తమమైన జీవన విధానం.

విజ్ఞులైనవారు తమకు కలిగిన సుఖదుఃఖాలు దైవసంకల్పం వల్ల కలిగినవేనని భావించాలి.

భగవంతుడు మీకు ఏది ఇచ్చినా తృప్తి పొందాలి.

మీకు ఒకటి దక్కటం దక్కకపోవటం అనేది మీ గత జన్మ కర్మఫల సంస్కారాల వల్ల సంభవిస్తుంది అని తెలుసుకోగలగాలి.

మీకు భగవంతుడు ఇచ్చిన అన్ని శక్తులను పరోపకారం కొరకు వినియోగించాలి.

మీకున్న మిత్రులు, శత్రువులు ఆ భగవంతుడి చేతిలో కీలుబొమ్మలే అన్నది బాగా అర్థంచేసుకుని ఇతరులని నిందించటం మానేయండి.

సేకరణ

No comments:

Post a Comment