Sunday, December 14, 2025

 *కుండలినీ యోగం.*  పార్ట 2                               🪷 *చూడటం - భావించటం - కలకనటం ఇలాంటి అనుభవాలన్నీ మనకు ఒక సామాన్య ప్రదేశంలోనే సంభవిస్తాయి♪. ఆ సామాన్య ప్రదేశమే మహా ఆకాశం లేదా భౌతిక ప్రపంచం♪. యోగులు తమ సంకల్పాలను స్వప్నరూపంలో చూస్తుంటారు; అతీంద్రియ విషయాలను కూడా దర్శిస్తుంటారు♪. ఇలాంటి అనుభవాలను వారు మరో ప్రదేశంలో పొందుతుంటారు; అదే మానసిక దేశం; దాన్నే చిత్తాకాశమంటారు♪. నిర్విషయ జ్ఞానావస్థలో ఆత్మ స్వయంజ్యోతియై ప్రకాశిస్తూ ఉంటుంది♪. ఆ దేశాన్ని జ్ఞానదేహ మంటారు; అదే చిదాకాశం♪.*

🪷 *కుండలినీ శక్తి జాగృతమై సుషుమ్నలో ప్రవేశించేటప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతాయి; అవన్నీ చిత్తాకాశానికి సంబంధించినవి♪. కుండలినీ సుషుమ్నను దాటి మెదడులోకి వెళ్లగానే, నిర్విషయజ్ఞానం కలుగుతుంది♪. ఇది చిదాకాశానికి సంబంధించినదై ఉంటుంది♪.*

🪷 ప్రకృతిని, విద్యుత్తును పోల్చి చూద్దాం. మనిషి విద్యుత్తును తీగల ద్వారానే పంపగలడు; కాని తన శక్తులను ప్రసారం చేయటానికి ప్రకృతికి ఎలాంటి తీగల అవసరం లేదు♪. కాబట్టి, శక్తి ప్రసారానికి తీగల ఆవశ్యకత లేదు; కాని మనకింకా ఆ సామర్థ్యం రాలేదు కాబట్టి, విద్యుత్తు ప్రసారానికి తీగలను ఉపయోగిస్తున్నాం♪.

🪷 అలాగే, దేహంలో కలిగే ఇంద్రియానుభవాలు, చలనాలు నాడీ తంతులనే తీగల ద్వారా మెదడులోకి వెళతాయి; మరల బయటికి వస్తుంటాయి. ఈ తంతువులన్నీ వెన్నుపాములో ఉంటాయి: వీటిలో జ్ఞానాన్ని కల్గించే తంతువులు ఇడానాడిగా, క్రియలను కలిగించే తంతువులను పింగళనాడిగా చెబుతారు♪.

🪷 మెదడునుంచి లోపలికి, వెలుపలికి వార్తలన్నీ ఈ తంత్రుల ద్వారానే వెలువడతాయి. అయితే ఈ తంత్రుల సహాయం లేకుండా వార్తలను పంపటం, గ్రహించటం మనసుకు సాధ్యమేనా? అంటే సంకల్ప ప్రవాహాన్ని సుషుమ్నా మార్గంలో పంపగలిగితే సాధ్యమేనని యోగులు చెబుతారు. నాడీకోశమనే ఈ తంతు సమూహాన్ని మనసే నిర్మాణం చేసుకున్నది. ఈ తంతిసమూహాన్ని భేదిస్తే, జ్ఞానమంతా మన వశమౌతుంది. శరీర ప్రకృతికి ఇక దాస్యం చేయనవసరం లేదంటారు♪.

✳️ విషయజ్ఞానం - అతీంద్రియ జ్ఞానం 🌹

🪷 సామాన్యుల్లో సుషుమ్న క్రింది చివర మూసుకుని ఉంటుంది. ఆ స్థితిలో అది క్రియారహితమై ఉంటుంది♪. ఈ చివరను తెరచి, నాడీ ప్రవాహాన్ని సుషుమ్న ద్వారా ఊర్ధ్వమార్గం పట్టించాలి. దీనికోసం యోగులు ఒక సాధనా విధానం చెబుతారు. నాడీ కేంద్రానికి ఒక వార్త వెళితే, అక్కడ ఒక ప్రతిక్రియ కలుగుతుంది. ఆ ప్రతిక్రియ ఆ నాడీకేంద్రాన్ని నడిపిస్తున్న జ్ఞానకేంద్రాల్లో చలనానికి కారణమవుతుంది♪.

🪷 కానీ, ముందుగా మనలో విషయజ్ఞానం కలగాలి. ఆ తర్వాతే చలనం ఏర్పడుతుంది. మనకు ప్రత్యక్షానుభవం లేని సందర్భాల్లో మనలోని స్పందనలన్నీ మూలాధారంలో అణిగిపోయి ఉంటాయి. ఆ అణగి ఉన్న క్రియాశక్తినే కుండలిని... అంటే చుట్టుకొని ఉన్నది - అని పిలుస్తారు♪.

🪷 ఏకాగ్రంగా అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మూలాధార ప్రాంతంలో వేడి పుడుతుంది. కుండలినీ శక్తిని మేల్కొల్పి, ప్రాణవంతం చేసి, సుషుమ్నలో పైకి వెళ్లేలా చేస్తే, అప్పుడు ఈ శక్తి ఒక చక్రం తర్వాత మరొక చక్రంపై తన ప్రభావం చూపుతుంది. ఆ స్థితిలో అత్యద్భుత ప్రతిక్రియ కలుగుతుంది♪.

🪷 కుండలినీ శక్తిలోని ఒక సూక్ష్మాంశం నాడీతంతువు నుండి పైకివెళితే, ఆయా కేంద్రస్థానాలు తమంతతామే ప్రతిక్రియ చేస్తాయి♪. అప్పుడే మనకు స్వప్నం లేదా మానసిక కల్పనలు కలుగుతాయి♪. ఇలా చాలాకాలంపాటు ధ్యానం చేస్తే ఎంతో బలం లభిస్తుంది; ఆ బలంతో కుండలినీ శక్తిని మొత్తంగా సుషుమ్న ద్వారా పైకి పంపించవచ్చు; అప్పుడా శక్తి అలా పైకి వెళుతూ, ఆయా కేంద్రాలను తాకుతుంది. అప్పుడు స్వప్నాదుల కన్నా గొప్ప ప్రతి క్రియ ఏర్పడుతుంది. అదే అతీంద్రియ జ్ఞానం.

🪷 మెదడు ఇంద్రియానుభవాలకు కేంద్రస్థానం. కుండలినీశక్తి దీన్ని చేరగానే, మెదడంతా ప్రతిస్పందిస్తుంది. దానితో పూర్ణచైతన్య ప్రకాశరూపమైన ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. కుండలినీశక్తి పైకి వెళుతూ ఒక్కొక్క చక్రాన్నే దాటుతూ ఉంటుంది. అలా దాటుతున్నప్పుడు మనసులోని పొరలు ఒకటొకటిగా తొలగిపోతుంటాయి♪. అప్పుడు యోగులు విశ్వ సూక్ష్మరూపాన్ని లేదా కారణరూపాన్ని దర్శిస్తారు. శబ్దాది విషయాల్లో, ఇంద్రియానుభవాల్లో వ్యక్తమయ్యే జగత్కారణాలను ప్రత్యక్షంగా చూస్తారు. జగత్కారణాలు తెలిస్తే చాలు - కార్యజ్ఞానం తప్పక కలుగుతుంది♪.

🪷 కాబట్టి, అతీంద్రియ జ్ఞానం - దివ్యజ్ఞానం - ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే కుండలినీశక్తిని జాగృతం చేయటం తప్ప మరో 'మార్గం లేదు. తాత్త్విక విశ్లేషణతో నిత్యానిత్యవస్తు వివేకంతో ఈశ్వర ప్రేమతో - సిద్ధపురుషుల అనుగ్రహంతో - - ఇంకా అనేక మార్గాల్లో కుండలినీశక్తిని జాగృతం చేయవచ్చు. తెలిసి చేసినా, తెలియక చేసినా ఉపాసన ఫలం తప్పక ఉంటుంది♪.
         ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

No comments:

Post a Comment