*అరటిపండును తొక్క తీసే తింటాం.
సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం.
*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం,పై తొక్కు,
లోపలి గింజలు వదిలేస్తాం.
*ఆపిల్, జామ పళ్ళని మొత్తం తినేస్తాం.
**ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.
**ఒక్కోటి ఒక్కో రుచి.తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.
*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు.
మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తమంతే.
**అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.
**కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు ,ఒక్కోరిది ఒక్కో స్వభావం.
అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే , వాళ్ళు చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది.
పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా !!*
**పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం.
*ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.*
****కుటుంబమనేది - ఏ మిక్సిడ్ భ్యాగ్ అఫ్ ఫ్రూట్స్!🍁.
No comments:
Post a Comment