Wednesday, May 20, 2026

 273D5.193e5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *సప్త చిరంజీవులు.*
                 ➖➖➖✍️


*1. అశ్వత్థామ :-*```
ద్రోణాచార్యుని కుమారుడు.
మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..```


*2. బలిచక్రవర్తి :-*```
ప్రహ్లాదునికి కుమారుడైన విరోచనుని కుమారుడు.ఇంద్రుని జయించినవాడు.

వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు తొక్కబడ్డాడు. కానీ ఇతని సత్య సంధితకు మెచ్చుకున్న వామనుడు గధాదారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు..```


*3. వ్వాసమహర్షి :-* ```
సత్యవతీ పరాశరుల కుమారుడు  కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబడేవాడు. అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడుని పేర్కొంటారు..```


*4. హనుమంతుడు :-*```
కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు. సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు. పరమేశ్వరుని అవతారము. రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేశ్వరుని హతమార్చడంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ. మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయానికి కూడా దోహదకారి అయ్యాడు.```


*5. విభీషణుడు :-*```
కైకసికి  విశ్వబ్రహ్మ కు కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడైయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు 
శ్రీ రామునికి  ఉపాయము చెప్పాడు. రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు..```


*6. కృపాచార్యుడు:-*```
సప్త చిరంజీవులలో 6వ వాడు . కృపుడు. శరద్వంతుని కుమారుడు.. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు.
ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి వేరే చోటుకు వెళ్ళాడు. 

ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు. కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.```


*7. పరశురాముడు:-*```
రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు. శివుని ఆఙ్ఞతో తీర్ధయాత్రలు చేశాడు. శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు.✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

No comments:

Post a Comment