*శ్రీ ఆదిశంకరాచార్య విరచితం*
శివానందలహరి – శ్లోకం – 74
ఆశాపాశక్లేశదుర్వాసనాది-
భేదోద్యుక్తైర్దివ్యగన్ధైరమన్దైః |
ఆశాశాటీకస్య పాదారవిన్దం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ||
నా మనస్సులో పరమేశ్వరపాదారవిందము ఎల్లప్పుడూ ఉండుగాక అని శంకరులు కోరుతూ, అపుడేమగునో అన్యాపదేశంగా చెప్పుతున్నారు.
నా మనస్సు నందు ఆశాపాశములూ, క్లేశములూ, దుర్వాసనలూ (చెడు సంస్కారములు) ఉన్నాయి. సాంబసదాశివుని పాదారవిన్దము నా మనస్సు యొక్క ఈలక్షణాలు పోగొట్టి, దివ్యములూ, విస్తారములూ అయిన పరిమళముల(సుసంస్కారములు) చేత నిండినదానిగా చేయుగాక.
పద్మములు సుగంధములు వెదజల్లి, చెడు వాసనలు దూరం చేయునట్లు, పరమేశ్వరుని పాదపద్మములు చెడు సంస్కారములను దూరం చేయునని భావము.
అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము – ఇవి పంచక్లేశములు.
No comments:
Post a Comment