*#ప్రతి మనిషి కూడా "ఆశ జీవి "ఏ ఆశ లేనిదే మనిషి జీవించలేడు. ఈ ఆశ ను నెరవేర్చుకున్నప్పుడే అత్యంత ఆనంద స్థితికి చేరుకుంటాడు.* *జీవితాంతం హాయిగా సుఖంగా ఉంటాడు. ఉదాహరణకు ఒక గొప్ప రాజకీయ నాయకుడు అయ్యి ప్రజలకు సేవ చేయాలనే భావన, గొప్ప ఇంజనీర్ అయ్యి దేశానికి ఉపయోగపడే విధానాలు ప్రాజెక్టులు నిర్మించాలని లక్ష్యము , ఒక గొప్ప పోలీస్ అధికారి అయ్యి దొంగలు లేకుండా అలాగే ప్రజారక్షణ, ఒక సైనికుడై దేశాన్ని రక్షించాలని సంకల్పం , ఒక పాలన అధికారి అయ్యి మంచి పనులు చేయాలని , ఒక సినిమా నటుడు లోకానికి ఆదర్శవంతమైన సినిమాలు చేయాలని ,అదేవిధంగా ఏ వృత్తిని ఎన్నుకున్న దానిని దైవంగా భావించి సేవ చేయాలని అనుకుంటారో అది లోకంలో మంచి" ఆశ "గానే పిలవబడుతుంది. అలాంటి "ఆశ " కలిగి ఉన్నందువలన ఎలాంటి తప్పలేదు.*
*అత్యాశ విషయానికి వద్దాం: ఈ వాక్యం లోనే విపరీత అర్థం ఉంది. అత్యాశ మంచి వాడిని కూడా చెడు మార్గంలోకి ప్రవేశించే విధంగా ప్రలోభ పెడుతుంది. ఎవరైతే దీని ప్రలోభాన్ని గురవుతారో , మంచి ఆశయంతో వచ్చిన వారు కూడా ఈ ప్రలోభానికి గురి చేసే "అత్యాశ" గల వ్యక్తుల ద్వారా వారు చదువుకున్న మంచి చదువు, జ్ఞానం కోల్పోయి అత్యాశ వలన చివరకు అధోగతి పాలై కటకటాలు(జైలుకు) కూడా వెళ్లవలసిన స్థితి వస్తుంది. ఇలాంటి వారిని మనం ఎంతో మందిని చూస్తున్నాం. కాబట్టి ప్రతి మనిషి ఆశతో బతకాలి ,కానీ అత్యాశని అలాంటి భావాలు గల వ్యక్తులను ఎప్పుడూ కూడా మన దరిదాపుల్లోకి రానివ్వకూడదు..*
.
#శుక్రాచార్యుడి శపథం*
రాక్షసుల గురువు ఉశీనుడు శుక్రాచార్యుడనే పేరుతొ ప్రసిద్ధికెక్కాడు . శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు . రాని యుద్ధ తంత్రం లేదు . ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని . ఆచార్యునిగా శుక్రుడు చాలా మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలున్నాయి . వాటిలో మొదటిది సురాపానమైతే , రెండవది కూతురిపట్ల గల ప్రేమానురాగాలు . శుక్రాచారునికి అపురూపమైన , అత్యద్భుతమైన మృతసంజీవనీ విద్య తెలుసు . దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై , మృతిచెందిన రాక్షసవీరులను బతికిస్తూ , రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. .దాంతో రాక్షుసుల బలం పెరుగుతూ , దేవతల బలం తగ్గుతూ వస్తోంది . ఇలా లాభం లేదనుకుని దేవతల గురువు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించాడు . ఎలాగైనా సరే , రాక్షసగురువు నుంచి మృతసంజీవని విద్యను నేర్చుకోవాలి . చూస్తూ చూస్తూ శుక్రుడు దేవతలకు ఆ విద్య భోదించడు కాబట్టి ఎలాగోలా నేర్పుగా శుక్రుడి నుంచి ఆ విద్యను సంగ్రహించాలి .
అందుకు ఎంతో ఒడుపు , చాకచక్యమూ కలిగిన వారు కావాలి . అంత ఒడుపుగా ఆ విద్యను సాధించగలవారెవ్వరా అని ఆలోచిస్తుండగా , నేనున్నానంటూ కచుడు ముందుకొచ్చాడు . కచుడు ఎవరో కాదు , బృహస్పతి కుమారుడే , దేవతలు అందరూ వెనుకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చిన కచుణ్ణి పితృవాత్సల్యంతో కావలించుకున్నాడు బృహస్పతి " కుమారా ! ఎంతో నేర్పరితనం , తెలివితేటలూ నీకున్నాయని తెలుసు . అయితే , ఆ విద్యను సాధించేందుకు కేవలం తెలివితేటలొక్కటే సరిపోదు . తంత్రం కూడా తెలిసుండాలి . అదేమంటే , శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు . ఆమెకోసం ఆయన ఏమైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో , అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు " అంటూ చక్కటి మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి .
కచుడు మానవరూపంలో శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళాడు . ఎంతో వినయంతో ఆయనకు తనను తానూ ఎవరూ లేని అనాధనని , మీ వద్ద విద్యలు నేర్చుకోవడానికి వచ్చానని పరిచయం చేసుకున్నాడు . ముందు ఒప్పుకోకపోయినా , విద్యపట్ల అతనికున్న తపన , అతని వినయ విధేయతలు , తెలివితేటలకు ముచ్చటపడి , తన వద్దనే ఉంచుకున్నాడు శుక్రుడు . గురువు బోధించిన విద్యలన్నిటినీ నేర్చుకుంటూ , ఎంతో వినయంతో , భక్తి గౌరవాలతో గురువుకు సేవలు చేయసాగాడు కచుడు , తమ గురువు కచుణ్ణి అభిమానించడం , గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షుసులకు కంటగింపుగా మారింది . ఓసారి అదను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేశారు రాక్షుసులు .
తర్వాత ఏమీ ఎరగనట్లుగా కచుడు కనబడటం లేదంటూ గురువుకు చెప్పారు . ఏమి జరిగిందో దివ్యదృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు . మృతసంజీవనీ విద్యతో కచుణ్ణి బతికించాడు . ఈ విధంగా రెండుమూడుసార్లు జరిగింది . చివరికి రాక్షుసులు కచుణ్ణి చంపి , కాల్చి బూడిదచేసి , ఆ బూడిదను మధ్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించారు . కచుడు ఎక్కడున్నాడా అని దివ్యదృష్టితో చూసిన శుక్రుడికి కచుడు బూడిద రూపంలో తన ఉదంరంలోనే ఉన్నట్లు తెలిసింది . పుత్రిక మీదున్న ప్రేమతో శుకాచార్యుడు తన ఉదరంలో ఉన్న కచుడికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు . కచుడు శుక్రుడు పొట్టను చీల్చుకుని వచ్చి , తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు.
" పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ , మధ్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా , రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృతసంజీవనీ విద్యను ఉపదేశించవలసి వచ్చింది," అని ఆలోచించిన శుక్రుడికి సిగ్గు వేసింది . జీవితంలో ఇక మద్యం ముట్టనని , ఎవరి మీదా మక్కువ పెంచుకోననీ శపధం చేసాడు..*
.
No comments:
Post a Comment