*గోత్రములు :-*
ఇవి అనేకములు. అందు కొన్ని శిష్యపరంపరను కొన్ని పుత్రపరంపరను తెలియ చేయును. వీనిని ఇన్ని అని లెక్క పెట్టిచెప్పుట అసాధ్యము. అయినను ఇందు ముఖ్యమైనవి ఏఁబది. అవి కాశ్యప భారద్వాజ హరిత కౌండిన్య కౌశిక వసిష్ఠ గౌతమ గార్గేయ శ్రీవత్స ఆత్రేయ ముద్గల శఠమర్షణాదులు. వానిలో ప్రతిదానియందును అంతర్భాగములు అనేకములు కలవు. మఱియును అవి ఏకార్షేయములు ద్వ్యార్షేయములు త్ర్యార్షేయములు పంచార్షేయములును అయి ఉండును. అనఁగా ప్రవర చెప్పునపుడు కొందఱు ఒక ఋషిని కొందఱు ఇద్దఱు ఋషులను కొందఱు ముగ్గురు ఋషులను కొందఱు అయిదుగురు ఋషులను చెప్పి చెప్పుదురు అని అర్థము.
No comments:
Post a Comment