Thursday, February 20, 2025

 *🌹🌹    ఛత్రపతి శివాజీ జయంతి    🌹🌹*

         *ఈ నెల పంతొమ్మిదిన   శివాజీ మహారాజు జయంతి సందర్భంగా వారి గొప్పతనం గూర్చి చెప్పుకుందాము.*

             *శివాజీ వీర విక్రమాలను గూర్చి ఆనాటి కవిరాజు భూషణుడు ఏమని చెప్పారో "ఇంద్ర జిమి జంభ పర్" అనే పాటను గూర్చి తెలుసుకుందాము.*

             *ఈ పాట మహారాష్ట్రలో అత్యంత పవిత్రమైనదిగా.. శివాజీ వీర విక్రమ శౌర్య ప్రతాపాలకి చిహ్నంగా అక్కడి హిందూ సోదరులంతా భావిస్తారు.*

            *కవి భూషణుడు వారణాసి లో నివసించిన  16 వ శతాబ్ధపు కవి. వీరు మొదట బుందేల్ ఖండ్ మహారాజు ఛత్రసాల్ రాజాస్థానములో ఉండేవారు. ఆ తరువాత శివాజీ మహారాజ్ వీర విక్రమాలను మెచ్చి శివాజీ ఆస్థానంలో ఉండేవారు .*

           *1613 లో కవి భూషణుడు నేటి ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ ప్రాంతములో జన్మించారు.. ఆయన సోదరులు చింతామణి, మతీరాం లు కూడా కవులే.. కవి భూషణుని అసలు పేరేవిటో ఎవరికీ తెలియదు .. చిత్రకూటం మహారాజు రుద్రప్రతాపుడు ఆయన కవితా, ప్రతిభా సంపత్తికి మెచ్చి ఇచ్చిన బిరుదం కవి భూషణుడు. కవులకు అలంకారము వంటి వారు అని అర్థం.*

                *ఆయన సంస్కృత , అరబీ,పర్షియన్ వంటి అనేక భాషలలో పాండిత్యం కలిగిన నేర్పరి. మొదటి సారిగా ఆగ్రాలో శివాజీని కలసిన కవి భూషణుడు , శివాజీ యొక్క శౌర్య గుణ గణాలకు ముగ్ధుడై ఆ తరువాత శివాజీ రాజాస్థానమునకు విచ్చేసారు.*

              *శివాజీ మహారాజా మహా పట్టాభిషేక సమయములో కవిరాజు భూషణుడు వ్రాసి చదివిన పద్యాలు "శివభవాని" పేరిట అనుప్రాస శ్లేషాలంకారములో ప్రసిద్ధి పొందాయి. 1712 లో కవి భూషణుడు పరమ పదం పొందారు.*

*ఇంద్ర జిమి జంభ పర్*
*బాడవ్ సు-అంభ పర్*

*రావణ సదంభ పర్ రఘు-కుల-రాజ్ హై*

*పౌన్ బారి బాహ పర్*
*శంభు రతి-నాథ్ పర్*

*జ్యో సహస్రబాహు పర్ రాం ద్విజ రాజ హై*

*దావ ద్రుమ-దండ పర్*
*చీతా మృగ-ఝుండ పర్*

*భూషణ వితుండ పర్ జైసే మృగరాజ్ హై*

*తేజ్ తమ అన్స పర్,*
*కన్నా జిమి కంస పర్*

*త్యో మ్లేచ్ఛ -వంశ పర్ షేర్ శివరాజ్ హై:*

               *కవిరాజ భూషణుడు*

          *మొదటి చరణములో దైత్యుల పాలిట ఇంద్రుడు తన వజ్రాయుధమును ఝళిపించి ఎలా దేవతలను కాపాడారో అలా శివాజీ మహారాజు మ్లేచ్చులు, క్రూర ముసల్మాను పాలకుల నుండి హిందువులను కాపాడారు అని. దుర్మార్గుల పాలిట సముద్రములో దాగిన బడబాగ్ని వంటి వారు శివాజీ అని , రావణాది దైత్యులను తెగటార్చిన రఘుకుల వంశమున జనించిన రాముని వంటి వారు అని చెబుతారు.*

           *రెండవ చరణములో : - కల్లోలం అనే మబ్బులు వాలే హిందూ జాతి పైకి ముసిరి వస్తున్న ఆనాటి క్రూర పాలకుల పాలిటి పెనుగాలి శివాజీ అని, నిష్టాగరిష్ఠుడైన శివుణ్ణి భంగ పరచాలని చూసిన మన్మథుణ్ణి ఎలా కాల్చి బూడిద చేశారో ఆ త్రినేత్రదారి మూడవ కంటికి ఉన్నంత శక్తియుతుడని, సహస్ర బాహువులు కలిగి, గర్వాంధుడు అయిన కార్తవీర్యార్జునుని కూల్చిన పరశురాముని వంటి వారు శివాజీ అని చెబుతారు.*

           *మూడవ చరణములో:- కారడవుల పాలిట దావానలం ఎలా ఎంత పెద్ద అడవిని అయినా చిచ్చు పెడుతుందో అంతటి వారు అని, దుర్మార్గుల పాలిట చిరుత పులిలా , అడవికి ఎలా ఒక మృగరాజు సింహం ఎలా వెలుగొందుతారో అలాగా శివాజీ మహారాజు విరాజిల్లుతున్నాడని అర్థం.*

          *నాలుగవ చరణములో : - కారు చీకట్లు కమ్మిన హిందూ సమాజానికి దొరకిన మేలు వెలుగు తీవ అని, దుష్ట దుర్మార్గుడైన కంసుని పాలిటి చిన్ని కృష్ణుడు ఎలాగో .. ముష్కర మూకల పాలిట శివాజీ అలాంటి వాడు అని, హిందువులను, హిందూ ధర్మాన్ని తుదముట్టించడానికి దుష్ట పన్నాగాలు , వలలు పన్నుతున్న వారి పాలిట శివాజీ మహారాజు ఒక పులి లాంటి వారు అని చెప్పడింది.*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

No comments:

Post a Comment