ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కోడలు, Queen Of Marathas గా కీర్తించబడిన మహారాణి శ్రీమతి తారాభాయ్ భోంస్లే గారి సమాధి పరిస్థితి ఇది ... మన దేశం లోకి చొరబడి, మనల్ని బానిసలుగా చేసుకుని, అతి క్రూరంగా హింసించి, హతమార్చిన వారికి కొన్ని ఎకరాలలో అందమైన సమాధులు ... తారాభాయ్ గారి సమాధి మాత్రమే కాదు ఎందరో దేశ భక్తులు, మహాత్ముల పరిస్థితి ఇలానే ఉంది ...
ఇక శ్రీమతి తారాభాయ్ గారి గురించి క్లుప్తంగా ...
' రైన్హా దొస్ మరాఠా ' గా పోర్చుగీస్ చేత కీర్తింపబడిన క్వీన్ ఆఫ్ మరాఠాస్ ' తారాభాయ్ భోంస్లే '..
ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనుక ఉన్న వారికి దుమ్ముతప్ప గుర్రం కనబడేది కాదట..కరవాలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్లగింజలు ఆవిడ ఒంటిని తాకలేక పోయేవట..
నేటికీ మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటల్లో సజీవంగా ఉన్నారు..
శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోంస్లే భార్య..
మరాఠా సర్లష్కర్ ( సర్వసేనాని ) హంభీరావ్ మోహితే కుమార్తె..
శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబ్ క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహరాజ్ చిన్న కొడుకు రాజా రాం రాయ్ ఘడ్ కోటనుంచి నేటి తమిళనాడు జింగీ కోటకు వలస వెళ్లారు..
అక్కడ నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు..దురదృష్టవశాత్తూ ఆయన ఊపిరితిత్తుల వ్యాదితో అక్కడే మరణించారు..
అప్పటికి మహారాణి తారాభాయ్ భోంస్లే వయసు కేవలం 25 ఏళ్ళు..
ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్ ఘడ్ కు చేరుకొని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలన్నీ తిరిగి రాబట్టారు..
ఆవిడ ప్రతి కోటనూ తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా మాల్వా ప్రాంతాన్ని ( ఉజ్జయిన్..బుర్హాంపూర్..సిరోంజీ..ముంద్రా ) తన అధీనంలోకి తెచ్చుకున్నారు..
ఒక స్త్రీ ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చి తననేమి గెలవగలదని మదంతో తారాభాయ్ మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని ఆలంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టి కిందపడేసిన సివంగి మన మహారాణి తారాభాయ్..
బతుకుజీవుడా అని పారిపోయి తిరిగి తన జీవితకాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు పిరికి ఆలంగీర్..
తన బావ శంభాజీ..భర్త రాజారాం ల మరణంతో నీరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలచి ..కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి 27 ఏళ్ళు పాటు మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని అవిచ్చన్నంగా ఏలిన ' వారియర్ క్వీన్ '..
భారత్ లో ఒక రాణి ఝాన్సీ..కాకతీ రుద్రమ్మ..చౌతా అబ్బక్క ల సరసన చేర్చదగ్గ వీరవనిత మహారాణి తారాభాయ్ '..🙏
జై మరాఠా.....
హరహార మహదేవ్......
దేశాన్ని ధర్మాన్ని కాపాడిన ఈ భూమి పత్రికకు అవమానకర సమాధి..🙏😢
No comments:
Post a Comment