Thursday, September 26, 2024

 *🌹🌹పరమాత్మను తెలుసుకోకపోతే🌹🌹*


            *పరమాత్మను కనుక తెలుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే. ఆయనను గనక తెలుసు కొంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయే.*

             *భవబంధాలనుంచి విముక్తి పొందాలంటే మనిషి తానైనదానికి, తాను కానీ దానికి మధ్య తేడాను అభ్యాసం చేయాలి. అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుకోగలుగుతాడు. చీకటి, అది కల్పించే భ్రమలూ అవన్నీ కూడా సూర్యుడు రానంతవరకే. సూర్యుడు వచ్చాకా అవన్నీ మటుమాయం కావలసిందే కదా ! అలాగే ఆత్మసాక్షాత్కారం కానంతవరకే ఈ మాయ పొరలన్నీనూ..*

            *నీవు కానిదాని గురించి ఆలోచించకు. అది నిన్ను కృంగదీస్తుంది. భాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీదా దృష్టి సారించు. అది నిన్ను అన్నింటినుంచి విముక్తుడిని చేస్తుంది. మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది.*

             *సంపదల వెంట పరుగులు పెట్టకు. ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది. సంపద గల మనిషి తన స్వంత కుమారులకు కూడా భయపడతాడు. ఇది సంపద వల్ల వచ్చే ఫలితం.*

             *సూర్యుడు నుంచి వచ్చే వేడి నుంచి చంద్రుడు భూమిని కాపాడుతూ ఉన్నట్లుగా, మహాత్ములు ఎల్లప్పుడు బాధల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేస్తుంటారు.నిర్గుణ సమాధి ద్వారా మనిషి తన వృదయంలో ఉన్న అజ్ఞాన ముడిని విప్పేసుకుంటాడు.*

            *బంగారాన్ని మండుతున్న కొలిమిలో గనక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యానమగ్నుడైతే పరిశుద్ధుడౌతాడు. ఇంద్రియనిగ్రహంతో వైరాగ్యభావం గల మనిషిలో ఉన్న శాంతినీ, సంతోషాన్ని ఎవరు పోగొట్టగలరు...?*

               *శ్వాసమీదనే ధ్యాస పెట్టుకొని ధ్యానమగ్నుడైన వాడికి అన్నీ ఉన్నట్లే. అజ్ఞానమే అన్ని బంధాలకు ఆదిమూలం. అదిపోతే దానితో బాటు వచ్చిన అన్ని బంధాలూ పటాపంచలవుతాయి.*

             *తామరాకు మీది నీటిబిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు.*

             *ఇంద్రియాలు సహకరిస్తే సుఖం. అవి సహకరించకపోతే దుఃఖం. కాబట్టి సుఖదుఃఖాలు రెండు కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకొంటే మంచిది.*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment