Sunday, September 29, 2024

 ©

ఒక మిత్రుడు నాతో సాయిబాబా అంటే నీకు కోపం ఎందుకు అని అడిగాడు. 

నా మతాలు, నా ధర్మము భూమిపై లేకుండా పోవడానికి కారణం అవుతున్న వాడి ఫై నాకు కోపం ఉండద్దా ? నేను అతడ్ని వ్యతిరేకించ వద్దా ? అతను ముస్లిం, అందుకే రోజు 5 సార్లు నమాజ్ చేసేవాడు, అల్లాహ్ ని మాత్రమే స్మరించేవాడు. ఇది ఇప్పటి వరకూ అందరూ చెప్పింది, విన్నది. 

కానీ కుట్రపూరితంగా ప్రమాదాన్ని కొనసాగించే ప్రయత్నం మొదలయ్యింది, అదే అన్ని మతాలు సమానం, సాయిబాబా అన్ని మతాలు సమానం అని చెప్పేవాడు అందుకే అతని గుడి అని చెప్పబడే వాటిని చర్చి మసీదు, గుడి ---మూడు కలిపి కట్టారు, కొన్ని అలా కట్టకపోయినా లోపల అన్ని మతాల గుర్తులు పెడతారు. అన్ని మతాలు అంటే ఇక్కడ మూడే ఉంటాయి. అన్ని మతాలు సమానం అని చెప్పడం వల్ల తాను ఏమతంలో ఉన్నా అభ్యంతరం లేదు అనే మానసిక స్థితిలో హిందువులు ఫిక్స్ అయ్యిపోయారు. దానివల్ల చుట్టాలో, స్నేహితులో మతం మారితే హిందువులో ఎలాంటి బాధ, తేడా ఉండదు. అతనితో ప్రవర్తించే విధానం లో మార్పు ఉండదు, అతని ఇంట్లో కార్యక్రమాలు జరిగితే వెడతాడు, వీళ్ళింట్లో కార్యక్రమాలకు పిలుస్తాడు. అతను ఇచ్చే యేసు, మేరీ ప్రసాదాల్ని పవిత్రంగా భావించి తీసుకుంటాడు. అదే ఇతను ఇచ్చే ప్రసాదాన్ని ఆ క్రిస్టియన్ తీసుకోడు. 

కుటుంబంలో మతం మారిన కొడుకు తనకు తిండిపెట్టి, చదివించి పెంచిన తండ్రికి తలకొరివి పెట్టడు, శవాన్ని కూడా మోయడు, పైగా దహనం చేయకూడదు, పాస్టర్ ని పిలిచి పూడ్చిపెట్టిస్తా అంటాడు, ఇది ఎంత దారుణంగా, బాధగా ఉంటుందో హిందువుకి మాత్రమే తెలుస్తుంది. సాయిబాబా ప్రభావం వల్ల హిందువులు ఏ మతం అయితే ఏమి అంటూ వేరే మతంలోకి పోయినా పర్వాలేదు అంటుంటే, క్రైస్తవులు మా మతంలోకి రా నీకు డబ్బులిస్తా అంటుంటే డబల్ ఎఫెక్ట్ పడదా ? హిందువు సులభంగా మతం మారడా ? ఈ దరిద్రానికి కారణం అన్ని మతాలు సమానం అని చెప్పిన సాయిబాబా కాదా ? చేసి చూపించిన అతని భక్తులు కాదా ? 

పైగా సాయిబాబా ముస్లిం అని తెలుసుకున్న తర్వాత కొంతమంది సాయిబాబా గుళ్ళు (దర్గా ) లోకి ముస్లింలను పిలిచి నమాజ్ చేయించి, ఆడవాళ్ళ చేత కల్మా చదివిస్తున్నారు సాయిబాబా భక్తులు అల్లా మీద పాటలు పాడుతున్నారు, రాక్షసులకి మించిన క్రూరత్వం ఉన్న లక్షల మంది సైన్యం ఉన్న 125 ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ లను చూస్తూ వాళ్ళ దేముడు అల్లానే అన్న జ్ఞానం లేకుండా జగతికి అల్లా మూలం అని పాటలు పాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి ?

 నిన్నటివరకు అన్ని మతాలు సమానం అని నమ్మి ఇతర మతాల దేముళ్ళని గౌరవించిన వాడు మతం మారాక హిందూ దేముళ్ళని సైతనులు అంటూ ఉమ్మేస్తూ, ఉచ్చబోస్తూ, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాడంటే లోపం హిందూ మతంది కాదా ? దానికి కారణం సాయిబాబా చెప్పిన సర్వ మత సమానత్వం కాదా ? పైగా కొంతమంది తాము హిందువులం కాదని  సాయి మతస్తులం అని కూడా అన్నారు, దానిపై అభిప్రాభేదాలు, తీవ్ర వ్యతిరేకత రావడంతో తోక ముడిచారు. సాయిమతం అన్నది ముస్లింలు చేసిన కుట్ర అని కొందరి అభిప్రాయం. 

సాయిబాబా అన్ని మతాలు సమానం అని చెప్పాడు కాబట్టే షిర్డీ సాయిబాబా అవతారం అని చెప్పుకున్న పుట్టపర్తి సాయిబాబా కూడా అదే చెప్పాడు, అన్ని గుర్తులు పెట్టుకున్నాడు, అలాగే బాల సాయిబాబా కూడా అన్ని మతాలు సమానం అని చెప్పి అన్ని గుర్తులు పెట్టాడు.  వీళ్ళు అన్ని మతాలు సమానం అంటూ హిందువుల్ని మతం మార్చడాన్ని సులభం చేసారు అనే విశ్వాసం తో క్రైస్తవులు చర్చిలో సాయిబాబా బొమ్మ పెట్టారా, రోజూ 5 సార్లు నమాజ్ చేసాడు, చచ్చే వరకూ అల్లా మాలిక్ అని లవ్ జిహాద్ కి రోడ్డు వేసాడు అని ముస్లింలు సాయిబాబా ఫోటో ని మసీదుల్లో పెట్టారా  ? -

--లేదే, పైగా సాయిబాబా భక్తి వల్ల డబ్బు, పరపతి కోసం కొత్త కొత్త గురువులు, దేముళ్ళు పుట్టుకొచ్చి హిందువుల్ని మరింత నాశనం చేసారు, అందరిలో దేముడ్ని చూడు అని చెప్పే వీళ్ళవల్ల హిందువులు ముస్లింని, క్రైస్తవుడ్ని పూజిస్తున్నారు--- వాళ్ళు మతం మారుస్తున్నారు.

 1980 లలో  సాయిబాబా భక్తి మొదలు అయింది దానికి ముందు చాలా మంది మేము దైవస్వరూపులం అని చెప్పారు కానీ వాళ్ళని మేము వ్యతిరేకించలేదు కారణం వాళ్ళు డబ్బు, పరపతి లకు పరిమితం అయ్యారు అందుకే వాళ్ళని మేము పట్టించుకోలేదు.వాళ్ళని చూసి సాయిబాబా డబ్బు తో సంబంధం లేనివాడు అని మోసపోయి వేలకోట్లు షిర్డీ హుండీలో వేసి ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి పోషించారు, మతం మారినా పట్టించుకోక శత్రువుల్ని ఆహ్వానించారు, ఇన్ని దరిద్రాలకు  సాయిబాబా కారణం కాబట్టే మేము వ్యతిరేకస్తున్నాం.    సర్వే హిందూ సుఖినోభవంతు.


©

No comments:

Post a Comment