Monday, February 10, 2025

 ,*_ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారమైనా,ఎదుటివారిని ఆదరించే మంచివాళ్లమే అయినా.. మన మాటతీరు సరిగాలేకపోతే ఎవ్వరూ కూడా దరిదాపుల్లోకిరారు._*

*_అవతలివారి హావభావాలను,భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అక్షరాలా ఒక కళే!_*

*_మన దృష్టికోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మన భావాలను ఎదుటి వారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తే ఎవరూ జీర్ణించుకోలేరు._*

*_మాట్లాడే సమయంలో అవతలి వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి..అదే కదా..నీ సంస్కారం.నీ పెదవి దాటిన మాట పృధ్వి దాటుతుందని సామెత._*

*_అందుకనే మనం ఏం మాట్లాడబోతున్నామో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందే ఊహించు కోవాలి._*

*_అన్ని కోణాల్లోనూ ఆలోచించుకుని నలుగురిలో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి."ఆలోచన నెరిగి మాట్లాడాలి._*

*_నాలుక చివరనే లక్ష్మి తాండవిస్తుంది. అంటే మాట్లాడేతీరూ తెన్నును బట్టే సంపద లభిస్తుంది.నాలుక చివరనే బంధు మిత్రులుంటారు._*

*_అంటే.. మన మాటలవల్లే మిత్రులు దొరుకుతారు, బంధువులు లభిస్తారు.నాలుక కారణంగానే బందీఅయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాటని అదుపు చేసుకుంటే జీవితంలో ఎదగగలవు.☝🏾_*

*_🙏🏾_*

No comments:

Post a Comment