Wednesday, February 12, 2025

 🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️

🙏 *పుండరీకుని కథ...* 
🙏 *శ్రీ పాండురంగాష్టకం*


           *పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధం చెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు దీర్ఘకాలం యుధ్ధంచేసి అలసిపోవటంవల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు ...*

                 *శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ అతడు ఏ ఆయుధం చేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు.*

            *నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం కావటం జరిగాయి. ఆ ముచుకుందుడే మరుజన్మలో పుండరీకుడిగా జన్మించాడు ..*

             *పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు. కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందని కూడా తెలిపారు. పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు ...*

              *ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు. పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి ఉండమని తన చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి ఉండమంటాడు. భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని ఉంటాడు.*

            *పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు. విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు. విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక*

              *ఇతర భక్తులు పుండరీకుడేకాదు ఇతర భక్తులు కూడా ఇక్కడ స్వామిని కొలిచి, స్వామితో ఆడి, పాడి, సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో. వారిలో కొందరు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, జ్ఞానేశ్వర మహారాజ్, జనాబాయి, నామదేవుడు, గోరా కుంభారుడు, సక్కుబాయి, తుకారాం, సమర్ధ రామదాసు, పురందరదాసు మొదలగువారు ఎందరో. జగద్గురువు శ్రీ శంకరాచార్యులు ఇక్కడకు వచ్చి పాండురంగాష్టకం రచించారు......*


🙏 *శ్రీ పాండురంగాష్టకం :* 

*మహాయోగపీఠే తటే భీమరథ్యా*

*వరం పుణ్డరీకాయ దాతుం మునీన్ద్రైః ।*

*సమాగత్య నిష్ఠన్తమానందకందం*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౧॥*

*తటిద్వాససం నీలమేఘావభాసం*

*రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ ।*

*వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౨॥*

*ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం*

*నితమ్బః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ ।*

*విధాతుర్వసత్యై ధృతో నాభికోశః*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౩॥*

*స్ఫురత్కౌస్తుభాలఙ్కృతం కణ్ఠదేశే*

*శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ ।*

*శివం శాంతమీడ్యం వరం లోకపాలం*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౪॥*

*శరచ్చంద్రబింబాననం చారుహాసం*

*లసత్కుణ్డలాక్రాంతగణ్డస్థలాంతమ్ ।*

*జపారాగబింబాధరం కఽజనేత్రం*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ ౫॥*

*కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాంతభాగం*

*సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః ।*

*త్రిభఙ్గాకృతిం బర్హమాల్యావతంసం*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ ౬॥*

*విభుం వేణునాదం చరంతం దురంతం*

*స్వయం లీలయా గోపవేషం దధానమ్ ।*

*గవాం బృన్దకానన్దదం చారుహాసం*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౭॥*

*అజం రుక్మిణీప్రాణసఞ్జీవనం తం*

*పరం ధామ కైవల్యమేకం తురీయమ్ ।*

*ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం*

*పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౮॥*

*స్తవం పాణ్డురంగస్య వై పుణ్యదం యే*

*పఠన్త్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ ।*

*భవాంభోనిధిం తే వితీర్త్వాన్తకాలే*

*హరేరాలయం శాశ్వతం ప్రాప్నువన్తి ॥*

*॥ ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య*

*శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య*

*శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ*

*శ్రీ పాండురంగాష్టకం సంపూర్ణం ॥

           *అందరం భక్తితో "  పాండురంగ విఠల పండరినాథ విఠల " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ జగన్నాథుడు.*

🙏 *పాండురంగ విఠలా,* 
       *పండరినాథ విఠల*

🙏సర్వేజనా సుఖినోభవంతు

🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️

No comments:

Post a Comment