రామాయణం మొత్తంలో భరతుడు అత్యంత తక్కువగా అంచనా వేయబడిన పాత్రనా?
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైననుచాలు,
విశ్వదాభిరామ వినురవేమ "
ఒక కుండ నిండా గాడిద పాల కన్నా ఒక గరిటెడు పవిత్రమైన గంగిగోవు పాలు శ్రేష్ఠమైనవని ఈ శ్లోకం తెలియజేస్తూంది.
రామాయణంలో భరతుని పాత్ర చిన్నదే అయినా, అది భవిష్యత్ తరాలకు ఎంతో విలువైన పాఠాన్ని నేర్పింది.
ఇప్పుడు నాయకులు అధికారం కోసం తమ బంధువులను కూడా చంపుతున్నారు. ఔరంగజేబు కూడా అధికారం కోసం తన తండ్రిని కారాగారంలో పడేసాడు.
అధికారం తన చేతుల్లో ఉన్నప్పటికీ, భరతుడు అధికారానికి దూరంగా ఉంటూ రాముని తరపున బయటి నుంచే పరిపాలించాడు. అతను అయోధ్యలో నివసించలేదు కూడా.
రాముడిని అరణ్యానికి పంపినందుకు అతను తన తల్లిని కూడా నిందించాడు. భరద్వాజ మహర్షికి తన తల్లిని పరిచయం చేస్తూ " ఈమె నా తల్లి కైకేయి, నా సోదరుడు రాముడి వనవాసానికి కారణమైనది ఈమెనే " అని అన్నాడు.
అటువంటి సద్గుణ సంపన్నుడు భరతుడు.
14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని మరుసటి రోజే తిరిగి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భరతుడు రాముడికి తెలియజేశాడు.
అటువంటి సద్గుణాన్ని పాటించడం ఎవరికైనా చాలా కష్టం. ధర్మబద్ధమైన జీవితం కోసం కోరికలను పక్కన పెట్టాలి. సంతోషకరమైన, అర్థవంతమైన మరియు ఫలవంతమైన జీవితం కోసం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో రామాయణం ప్రతి పాత్ర ద్వారా మనకు బోధిస్తుంది.
అందుకే రామాయణం ఇతిహాసం.
శుభమస్తు.
No comments:
Post a Comment