Friday, July 17, 2026

 *కర్మ ఫలితాన్ని ఇవ్వకపోతే కర్మలే వ్యర్ధం. కర్మఫలాలు మూడు రకాలు: ఇష్టం, అనిష్టం, మిశ్రమం. జీవులు వారి వారి కర్మలననుసరించి అనుభవిస్తారు. ఇది ఈశ్వర నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. కర్మలు ఈశ్వర ప్రేరితములు. కాబట్టి ఈశ్వరుడే కర్మఫలానికి హేతువు. ధర్మాధర్మాలు చేయించే వాడు కూడా ఈశ్వరుడే. "ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ దేవత యందే వానికి భక్తిశ్రద్ధలు కలిగేటట్లు చేస్తాను. ఆ భక్తుడు నా వలనే ఆ భోగములను తప్పక పొందుతాడు" (భ.గీ). భగవంతుడు మానవ ప్రయత్నాన్ని బట్టి ఫలాన్ని సమకూరుస్తాడు. (బ్రహ్మసూత్రములు)*

    *మనం ఒక నిర్దిష్ట వస్తువు గురించి సానుకూలంగా ఆలోచిస్తే, దాని పట్ల మమకారం పెరుగుతుంది. మనం ఏదో ఒక పనిని ముఖ్యమైనదిగా పదేపదే భావిస్తే, దానిపట్ల కూడా మమకారం, అనుబంధం ఏర్పడుతుంది. అదేవిధంగా మనం నిరంతరం భగవంతుని గురించి "ఆయనే సర్వోన్నతుడు, ఆయనను స్మరిస్తే అపారమైన ఆనందం కలుగుతుంది", అని ఆలోచిస్తే, ఈశ్వరుని పట్ల భక్తి దృఢంగా స్థిరపడుతుంది.*

     *మనస్సును అస్థిరపరచే ఇంద్రియాల శక్తిని తక్కువగా అంచనా వేయడం, ఇతరుల చర్యల పట్ల దోషపూరిత స్వీయ-సమర్థన, మితిమీరిన ఆత్మవిశ్వాసం మరియు చేయకూడని చోట రాజీపడటం లాంటివి ఒక వ్యక్తి నైతిక ఆధ్యాత్మిక పతనానికి కారణమయ్యే అంశాలు.*.         *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment