మనిషి పోయేటప్పుడు తనతో తీసుకెళ్ళేది అనుభవ జ్ఞానం, పాప పుణ్య ఫలం, తాను చేసిన సాధన ఫలం. డబ్బు ముఖ్యం కాదు కానీ డబ్బు కోసం నీవు చేసిన పనుల వల్ల కలిగేఫలితం ముఖ్యం, అది నీతో వస్తుంది, ఫలితం ఇస్తుంది. డబ్బు కోసం పాపం చేస్తే కష్టం తప్పదు. ధర్మంగా సంపాదించిన సంపద సౌఖ్యాన్ని ఇస్తుంది. ధర్మం సమాజాన్ని బట్టి సమయాన్ని బట్టి మారుతుంది. సత్యంమారదు. ధర్మం సత్యం చుట్టూ తిరుగుతుంది. స్వధర్మం విశ్వ ధర్మానికి అనుసంధానం అయి ఉండాలి లేదంటే అది ధర్మం కాదు. భీష్మడి స్వధర్మం వల్ల కష్టాల పాలయ్యాడు, అతడి స్వధర్మం అధర్మం వైపు వెళ్ళింది.
http://youtube.com/post/Ugkx-zLKOTAqpbJsX-Chpltyt9HKcX6hHi89?si=6ktodIyfCO0oxSY3

No comments:
Post a Comment